Share News

ప్రజాస్వామ్య సౌధంపై బుల్డోజర్లు: ఖర్గే

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:02 AM

ప్రజాస్వామ్య సౌధాన్ని నాశనం చేసేందుకు, బుల్డోజర్ల తరహాలో వ్యవస్థలను కూల్చివేసేందుకు గత పదేళ్లుగా వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.

ప్రజాస్వామ్య సౌధంపై బుల్డోజర్లు: ఖర్గే

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: ప్రజాస్వామ్య సౌధాన్ని నాశనం చేసేందుకు, బుల్డోజర్ల తరహాలో వ్యవస్థలను కూల్చివేసేందుకు గత పదేళ్లుగా వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో శ్రమపడి నిర్మించిన వ్యవస్థలను ధ్వంసం చేయకుండా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఈ ఏడాది తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అందువల్ల 2024ను కీలక మలుపు తిరిగిన సంవత్సరంగా గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డారు.

Updated Date - Sep 16 , 2024 | 05:02 AM