Share News

Kolkata: సీఎం ఇంట్లో జూనియర్ వైద్యుల సమావేశం.. ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం

ABN , Publish Date - Sep 14 , 2024 | 06:33 PM

జూనియర్ వైద్యులు ప్రధానంగా 5 డిమాండ్లపై పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను మెరుగుపరచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Kolkata: సీఎం ఇంట్లో జూనియర్ వైద్యుల సమావేశం.. ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జూనియన్ డాక్టర్లు కొనసాగిస్తున్న నిరసనల క్రమంలో శనివారంనాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. జూనియర్ వైద్యుల ఈ-మెయిల్‌కు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మనోజ్ పండిట్ స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను ఆహ్వానించారు. దీంతో కొద్దిరోజులుగా తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


వాతావరణ ప్రతికూల పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ముఖ్యమంత్రి తమ నిరసనల శిబిరానికి వచ్చి మాట్లాడినందుకు జూనియర్ వైద్యులు కృతజ్ఞతలు తెలుపుతూ ఇ-మెయిల్ పంపారు. దీంతో 15 మంది ప్రతినిధులతో కూడిన జూనియర్ వైద్యుల బృందం చర్చల కోసం కాళీఘాట్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి సాయంత్రం 6 గంటలకు రావాలని డాక్టర్ పంత్ వారిని ఆహ్వానించారు.

Mamata Banerjee: అక్కగా వచ్చా, సీఎంగా కాదు.. నిరసన శిబిరంలో వైద్యులతో మమతా బెనర్జీ


కాగా, జూనియర్ వైద్యులు ప్రధానంగా 5 డిమాండ్లపై పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను (వర్కింగ్ కండిషన్స్) మెరుగుపరచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Read MoreNational News and Latest Telugu News

Rain Alert: 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక

Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే

Updated Date - Sep 14 , 2024 | 06:33 PM