Share News

Mansoor Ali Khan: పధాని అభ్యర్థులుగా రాహుల్‌, ప్రియాంక ఉన్నారు...

ABN , Publish Date - Mar 31 , 2024 | 11:36 AM

ప్రధానమంత్రి అభ్యర్థులుగా తమ పార్టీ తరపున కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ పేర్లను ప్రతిపాదిస్తున్నట్టు ఇండియా జననాయగ పులిగల్‌ కట్చి అధ్యక్షుడు, సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) తెలిపారు.

Mansoor Ali Khan: పధాని అభ్యర్థులుగా రాహుల్‌, ప్రియాంక ఉన్నారు...

- మన్సూర్‌ అలీఖాన్‌

చెన్నై: ప్రధానమంత్రి అభ్యర్థులుగా తమ పార్టీ తరపున కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ పేర్లను ప్రతిపాదిస్తున్నట్టు ఇండియా జననాయగ పులిగల్‌ కట్చి అధ్యక్షుడు, సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా వేలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశం అన్ని రంగాల్లో వృద్ధి చెందిందని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం ఈ శతాబ్దపు జోక్‌ అని అన్నారు. దేశంలో 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాల కల్పించినట్టు చేస్తున్న ప్రచారంలో కూడా ఏమాత్రం నిజం లేదన్నారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రసంగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు సవాల్‌ విసురుతున్నానన్నారు.

Updated Date - Mar 31 , 2024 | 11:36 AM