Share News

ముంబైలో బాలికపై అత్యాచారం

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:07 AM

మహారాష్ట్రలో బద్లాపూర్‌ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

ముంబైలో బాలికపై అత్యాచారం

  • సోషల్‌మీడియాలో పరిచయమైన యువకుడి దురాగతం

ముంబై, ఆగస్టు 22: మహారాష్ట్రలో బద్లాపూర్‌ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియాలో పరిచయమైన 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక, ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి, అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వకోలా పోలీసులు వెల్లడించారు. 21 ఏళ్ల నిందితుడు ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడని.. బాధితురాలు అతడికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైందని తెలిపారు.


ఈ నేపథ్యంలోనే ఒకసారి కలవాలని నిర్ణయించుకుని.. ఈనెల 15న వారిద్దరూ బయటికెళ్లారని చెప్పారు. ముందుగా అంధేరిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు.. తర్వాత తన సొంతూరికని చెప్పి గుజరాత్‌కు తీసుకెళ్లి అక్కడ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వివరించారు.

ఆ తర్వాత ఇంటికి చేరిన బాధితురాలు.. కుటుంబ సభ్యులకు తనపై జరిగిన ఘోరాన్ని తెలిపిందన్నారు. బాధితురాలితో కలసి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని గుర్తించి గోరేగావ్‌లో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Updated Date - Aug 23 , 2024 | 03:09 AM