Home » Bombay High Court
ముంబై లోకల్ రైల్వే స్టేషన్లలో జరిగిన ప్రమాదాలపై జతిన్ యాదవ్ అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. లోకల్ ట్రైన్స్ వల్ల ఎంతమంది చనిపోయారో తెలియజేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. సమాచారం ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది.
మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..
మహారాష్ట్రలో బద్లాపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
కళాశాల క్యాంపస్లలో విద్యార్థులు హిజాబ్లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
కళాశాల ఆవరణల్లో హిజాబ్ ధారణపై నిషేధం విధించడం సబబేనని బుధవారం బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఏకరూప వస్త్రధారణ దృష్ట్యా విద్యార్థులు హిజాబ్, బుర్ఖా, నకాబ్, టోపీలను ధిరించకుండా నిషేఽధం విధించవచ్చని తెలిపింది.
బాల్య వివాహ బాధితురాలికి గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పునిచ్చింది. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉండటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలికకు 2022లో బాల్యవివాహం జరిగింది.
అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ.10వేలు చెల్లించాల్సిందేనని ఓ మహిళను బాంబే హైకోర్టు(Bombay High Court) ఆదేశించింది. గురువారం ఇందుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల్లో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైందని చెబుతారని జస్టిస్ షర్మిలా దేశ్ముఖ్తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.
తప్పుడు కుల ధ్రువీకరణ కేసులో ప్రముఖ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లుబాటు అయ్యేలా స్క్రూటినీ కమిటీ ఉత్తర్వులను భారత అత్యున్నత న్యాయస్థానం ( Supreme Court ) సమ
ఇది ముంబైలో చోటు చేసుకున్న ఓ వింత ఘటన. అతను ఓ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force) అధికారి. ఒకరోజు అతను అర్థరాత్రి సమయంలో మహిళ ఇంటి తలుపు తట్టాడు. అంతే.. ఆ ఒక్క పరిణామం అతని జీవితాన్ని మార్చేసింది. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరికి బాంబే హైకోర్టు కూడా అతనికి గట్టిగా మొట్టికాయలు వేసింది.
మావోయిస్టు లింక్ కేసులో జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, మహేష్ టిర్కీ, విజయ్ టిర్కీ, నారాయణ్ సాంగ్లికర్, ప్రశాంత్ రాహి, పాండు నరోటే (మరణించిన)లను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. హైకోర్టు గతంలో నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సాయిబాబా అప్పీల్ను బాంబే హైకోర్టు రిహిల్ చేసింది.