Share News

మోదీకి మస్క్‌ అభినందనలు!

ABN , Publish Date - Jul 21 , 2024 | 06:16 AM

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సందర్భంగా ప్రధాని మోదీకి ఆ సంస్థ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌

మోదీకి మస్క్‌ అభినందనలు!

న్యూయార్క్‌, జూలై 20: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సందర్భంగా ప్రధాని మోదీకి ఆ సంస్థ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అత్యధికులు అనుసరించే ప్రపంచ నాయకుడిగా నిలిచిన నరేంద్రమోదీకి అభినందనలు’’ అంటూ శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. గతవారమే మోదీ ఈ మైలురాయిని చేరుకోగా తాజాగా మస్క్‌ శుభాకాంక్షలు చెప్పారు. కాగా, మోదీ తర్వాత ఎక్స్‌లో అత్యధికులు అనుసరిస్తున్న దేశాధినేతల జాబితాలో... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(38 లక్షలు) ఉన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 06:16 AM