Share News

National : నేపాల్‌లో నదిలో పడిపోయిన రెండు బస్సులు

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:49 AM

నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు సహా 65 మంది గల్లంతయ్యారు.

National : నేపాల్‌లో నదిలో పడిపోయిన రెండు బస్సులు

  • ఏడుగురు భారతీయులు సహా 65 మంది గల్లంతు

ఖాఠ్మాండు, జూలై 12: నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు సహా 65 మంది గల్లంతయ్యారు.

ఈ విషాదం శుక్రవారం తెల్లవారుజామున చిత్వాన్‌ జిల్లాలో జరిగింది. 24 మంది ప్రయాణికులతో ఏంజెల్‌ బస్సు ఖాఠ్మాండుకు, 41 మంది ప్రయాణికులతో గణపతి డీలక్స్‌ బస్సు గౌర్‌కు బయలుదేరాయి. ఈ క్రమంలో బస్సులు నారాయణ్‌ఘట్‌-ముగ్లింగ్‌ రోడ్డుపైకి చేరుకున్నాక వాటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో బస్సులు పక్కన ఉన్న తిశ్రూలి నదిలో పడిపోయాయి.

Updated Date - Jul 13 , 2024 | 03:49 AM