Share News

Nitish Kumar: నితీశ్‌ రాజకీయ వారసుడు మనీశ్‌!

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:43 AM

నితీశ్‌కుమార్‌ రాజకీయ వారసుడు ఎవరంటూ జరుగుతున్న చర్చకు దాదాపుగా తెర పడినట్టే! ఆయన సలహాదారు, మాజీ ఐఏఎస్‌ మనీశ్‌ వర్మ అధికారికంగా జేడీయూలో చేరారు.

Nitish Kumar: నితీశ్‌ రాజకీయ వారసుడు మనీశ్‌!

పట్నా, జూలై 10: నితీశ్‌కుమార్‌ రాజకీయ వారసుడు ఎవరంటూ జరుగుతున్న చర్చకు దాదాపుగా తెర పడినట్టే! ఆయన సలహాదారు, మాజీ ఐఏఎస్‌ మనీశ్‌ వర్మ అధికారికంగా జేడీయూలో చేరారు. మనీశ్‌ చేరికతో నితీశ్‌ వారసుడి విషయంలో స్పష్టత వచ్చేసినట్టేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయనను త్వరలోనే పార్టీ జాతీయ ప్రధాని కార్యదర్శిగా నితీశ్‌కుమార్‌ నియమిస్తారని ఈ వర్గాలు చెబుతున్నాయి.


Manish-1.jpg

ఎవరీ మనీశ్..?

మనీశ్‌ 2000 బ్యాచ్‌ ఒడిశా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. 2018లో నితీశ్‌ సూచనతో స్వచ్ఛంద పదవీవిరమణ పొందారు. అప్పటినుంచి నితీశ్‌కు బాగా సన్నిహితంగా ఉంటున్నారు. జేడీయూ సామాజిక పునాది వర్గం అయిన కుర్మీలకు చెందిన వ్యక్తి కావడం మనీశ్‌ వర్మకు కలిసివచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

Manish.jpg

Updated Date - Jul 11 , 2024 | 07:48 AM