Share News

patna : బిహార్‌లో పిడుగుపాటుకు 25 మంది మృతి

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:07 AM

బిహార్‌లో 24గంటల వ్యవధిలో చోటుచేసుకున్న వేర్వేరు పిడుగుపాటు ఘటనల్లో 25మంది మరణించారు. 39 గాయపడ్డారు. ఈ కారణంగా కిషన్‌గంజ్‌, అరారియా జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.

patna : బిహార్‌లో పిడుగుపాటుకు 25 మంది మృతి

పట్నా, జూలై 12: బిహార్‌లో 24గంటల వ్యవధిలో చోటుచేసుకున్న వేర్వేరు పిడుగుపాటు ఘటనల్లో 25మంది మరణించారు. 39 గాయపడ్డారు. ఈ కారణంగా కిషన్‌గంజ్‌, అరారియా జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు రూ.4లక్షల వంతున పరిహారం చెల్లించనున్నట్టు సీఎం నీతీశ్‌ కుమార్‌ తెలిపారు. పిడిగుపాటు కారణంగా ఈ నెలలో ఇంతవరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. గురువారం బర్కాగాం గ్రామంలోని పాఠశాల సమీపంలోని తాటిచెట్టుపై పిడుగుపడడంతో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు.

Updated Date - Jul 13 , 2024 | 05:07 AM