Share News

Lok Sabha Results: హసన్ సీటు కోల్పోయిన ప్రజ్వల్

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:00 PM

లైంగిక వేధింపుల కేసులో తీవ్ర సంచలనం సృష్టించిన జేడీఎస్ నేత, హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణకు గట్టి దెబ్బ తగిలింది. హసన్ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ చేతిలో ఓటమిని చవిచూశారు.

Lok Sabha Results: హసన్ సీటు కోల్పోయిన ప్రజ్వల్

బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో తీవ్ర సంచలనం సృష్టించిన జేడీఎస్ నేత, హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ (Prajwal Revanna)కు గట్టి దెబ్బ తగిలింది. హసన్ (Hassan) నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ (Shreyas Patel) చేతిలో ఓటమిని చవిచూశారు. 40,000 పైగా ఓట్ల ఆధిక్యతతో శ్రేయాస్ పటేల్ విజయం సాధించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై శ్రేయాస్ పటేల్ పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆసక్తికరంగా, హసన్ నియోజవర్గం గత 25 ఏళ్లుగా జేడీఎస్‌కు పెట్టని కోటగా నిలిచింది. తొలిసారి ప్రజ్వల్ రేవణ్ణ ఓటమితో జేడీఎస్‌‌ ఆ నియోజకవర్గంపై పట్టు కోల్పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే హసన్ నియోజకవర్గం నుంచి 1.4 లక్షల మెజారిటీతో ప్రజ్వల్ గెలుపొందారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 03:00 PM