Share News

Swati Maliwal: స్వాతి మలివాల్‌పై దాడి కేసును విచారించేందుకు సిట్‌ ఏర్పాటు

ABN , Publish Date - May 21 , 2024 | 09:10 AM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌(Swati Maliwal)పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ దాడి చేసిన వారం తర్వాత, ఢిల్లీ పోలీసులు(delhi police) దర్యాప్తునకు మరో అడుగు ముందుకు వేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్‌(SIT)ను ఏర్పాటు చేశారు.

Swati Maliwal: స్వాతి మలివాల్‌పై దాడి కేసును విచారించేందుకు సిట్‌ ఏర్పాటు
swati Maliwal case update

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌(Swati Maliwal)పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ దాడి చేసిన వారం తర్వాత, ఢిల్లీ పోలీసులు(delhi police) దర్యాప్తునకు మరో అడుగు ముందుకు వేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్‌(SIT)ను ఏర్పాటు చేశారు. సిట్‌కు ఉత్తర ఢిల్లీ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) అంజిత చెప్యాల నేతృత్వం వహిస్తారు.

దీంతోపాటు సిట్‌లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారులను చేర్చారు. వారిలో కేసు నమోదైన సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి కూడా ఉన్నారు. విచారణ అనంతరం సిట్‌ తన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తుందని పోలీసులు వెల్లడించారు.


మే 13న ఉదయం మలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్(Vibhav Kumar) దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో జరిగిన క్రమాన్ని తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు సోమవారం విభవ్ కుమార్‌ను సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలను సీక్వెన్స్‌గా నోట్ చేసుకున్నామని, వాటిని మ్యాప్ చేసి గంటపాటు నేరం జరిగిన ప్రదేశాన్ని ఫొటోలు తీశామని పోలీసు అధికారులు తెలిపారు.


సీన్‌ రీక్రియేట్

నిందితుడు, బాధితురాలు ఇద్దరినీ క్రైమ్ సీన్‌కి తీసుకెళ్లి, క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేసినందున, ఇద్దరూ వివరించిన సంఘటనల క్రమాన్ని విశ్లేషిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విభవ్ కుమార్ నివాసాన్ని కూడా సందర్శించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విభవ్ కుమార్ మొబైల్ డేటాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆ సమాచారం తెలిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


ఈ కేసులో మే 13న సీఎం నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది సహా 25 మంది వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతోపాటు డీవీఆర్‌ను పర్యవేక్షిస్తున్న వ్యక్తులను కూడా విచారించనున్నారు. అంతేకాకుండా మే 13 నాటి ఫుటేజీని DVR నుంచి ఎవరు తొలగించారు, ఎవరి సూచనల మేరకు కూడా దర్యాప్తు చేయబడుతుంది. దీనికి సంబంధించి జాబితాను సిద్ధం చేసి త్వరలో నోటీసు పంపుతామని పోలీసులు చెప్పారు.


ఇది కూడా చదవండి:

Rains: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజులు వర్షాలు.. మరోవైపు ఎండలు కూడా

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Read Latest National News and Telugu News

Updated Date - May 21 , 2024 | 09:13 AM