Share News

ఫిష్‌ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:06 AM

గుజరాత్‌లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్‌మ్యాన్‌ అప్రమత్తత కారణంగా విఫలమయింది.

ఫిష్‌ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర

సూరత్‌, సెప్టెంబరు 21: గుజరాత్‌లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్‌మ్యాన్‌ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్‌ జిల్లాలోని కోసంబ- కిమ్‌ స్టేషన్ల మధ్య రైలు పట్టాలను కలిపే ఫిష్‌ప్లేట్లను తొలగించడంతోపాటు, 40-50 బోల్టులను వదులు చేశారు. రెండు ఫిష్‌ ప్లేట్లను తొలగించి పక్కనున్న ట్రాక్‌పై పెట్టారు. తెల్లవారు జాము 5.30 గంటల సమయంలో దీన్ని గమనించిన లైన్‌మ్యాన్‌ అధికారులను అప్రమత్తం చేశాడు. ఇంజినీర్లు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసిన తరువాత రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.

Updated Date - Sep 22 , 2024 | 03:06 AM