Share News

Sonia Gandhi: జైపూర్‌కు బయలుదేరిన సోనియా గాంధీ

ABN , Publish Date - Feb 14 , 2024 | 08:41 AM

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో బుధవారం ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు బయలుదేరారు.

Sonia Gandhi: జైపూర్‌కు బయలుదేరిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో బుధవారం ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు బయలుదేరారు. ఈ రోజు రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోనియా వెంట రాహుల్ గాంధీ ఉన్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా నామినేషన్‌ పత్రాల సమర్పణకు గురువారం చివరి రోజు కాగా, 27న ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం సోనియా గాంధీ తొలిసారిగా ఎగువ సభలో అడుగుపెట్టనున్నారు. ఆమె ఖాళీ చేసిన రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Feb 14 , 2024 | 08:41 AM