Share News

Rahul Citizenship: రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి

ABN , Publish Date - Aug 16 , 2024 | 06:26 PM

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన భారతదేశ పౌరసత్వంపై భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించారు.

Rahul Citizenship: రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పౌరసత్వం (citizenship) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన భారతదేశ పౌరసత్వంపై భారతీయ జనతా పార్టీ (BJP) నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఢిల్లీ హైకోర్టు (Delhi High court)ను శుక్రవారంనాడు ఆశ్రయించారు. రాహుల్ భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందింగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs)కు ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆయన కోరారు.


లీగల్ వెబ్‌సైట్ బార్ అండ్ బెంచ్ సమాచారం ప్రకారం, 2003లో యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK)లో రిజిస్టర్ అయిన బ్యాకప్స్ లిమిటెడ్ (Backops Limited) డైరెక్టర్లు, సెక్రటరీలలో రాహుల్ గాంధీ ఒకరని పేర్కొంటూ 2019లో హోం శాఖకు సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. 2005 అక్టోబర్ 10, 2006 అక్టోబర్ 31 తేదీల్లో ఆ సంస్థ దాఖలు చేసిన రిటర్న్స్‌లో రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరుడిగా డిక్లేర్ చేసినట్టు స్వామి ఆ లేఖలో పేర్కొన్నారు. 2009 ఫిబ్రవరి 17న ఆ కంపెనీ రద్దు చేసినప్పుడు చేసుకున్న దరఖాస్తులోనూ రాహుల్ బ్రిటిష్ జాతీయతను మరోసారి ప్రకటించినట్టు ఆయన ఎంహెచ్ఏ దృష్టికి తెచ్చారు.

Muhammad Yunus-Modi: హిందువులకు రక్షణ కల్పిస్తాం.. మోదీకి ఫోన్ చేసిన బంగ్లా సారథి యూనస్


రాజ్యాంగ ఉల్లంఘన

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారత పౌరసత్వ చట్టం 1955ను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్టు స్వామి ఆరోపించారు. కాగా, దీనిపై 15 రోజుల్లోగా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతూ 2019 ఏప్రిల్ 29న రాహుల్ గాంధీకి హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఎంహెచ్ఏ లేఖ రాసి ఐదేళ్లయినా ఇంతవరకూ రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం లేదని బీజేపీ ఆరోపిస్తోంది.


ఐదోసారి ఎంపీగా

రాహుల్ గాంధీ ఇంతవరకూ ఐదుసార్లు ఎంపీగా ఉన్నారు. 2004-2019 మధ్య మూడుసార్లు అమేథీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూసినప్పటికీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. వయనాడ్ నుంచి కూడా ఎన్నికైనప్పటికీ ఆ నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో విపక్ష నేత హోదా దక్కింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 06:29 PM