Share News

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి.. 18 మృతి

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:10 AM

సిరియాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 18 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారని సిరియా అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది.

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి.. 18 మృతి

డమాస్కస్‌, సెప్టెంబరు 9: సిరియాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 18 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారని సిరియా అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది. దాడుల్లో చనిపోయినవారిలో నలుగురు సాధారణ పౌరులని యూకే నుంచి పనిచేసే సిరియా మానవ హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. సిరియాలో ఆయుధాల తయారీకి వచ్చినఇరాన్‌ నిపుణులు, మిలీషియా ఉన్న ప్రాంతంపైనా ఇజ్రాయెల్‌ దాడి చేసిందని ఆ సంస్థ తెలిపింది. తీర ప్రాంతంలోని టార్షస్‌ నగరంపైనా దాడులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది.

Updated Date - Sep 10 , 2024 | 03:10 AM