Share News

Jammu Kashmir: తెల్లవారు జామున చెలరేగిన మంటలు.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల దుర్మరణం..

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:42 AM

జమ్మూకశ్మీర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలోని ధన్మస్తా-తజ్నిహాల్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.

Jammu Kashmir: తెల్లవారు జామున చెలరేగిన మంటలు.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల దుర్మరణం..

జమ్మూకశ్మీర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలోని ధన్మస్తా-తజ్నిహాల్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువతులు అగ్నికి ఆహుతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని మూడంతస్తుల ఇంట్లో తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు. మృతులను బిస్మా (18), సైక (14), సానియా (11) గా గుర్తించారు. ఇల్లు మొత్తం మంటలు వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ముగ్గురు యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 10:42 AM