Share News

Lok Sabha Results: కిషోరి లాల్ శర్మకు ప్రియాంక ఎమోషనల్ పోస్ట్..

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:36 PM

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలుపు ఖాయమంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ గెలుపు దాదాపు ఖాయం కావడంతో ఆయన తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా 'అడ్వాన్స్ గ్రీటింగ్స్' చెప్పారు. ''కిషోరి భాయ్... మీ గెలుపు ఖాయమని నాకు ముందే తెలుసు'' అంటూ ట్వీట్ చేశారు.

Lok Sabha Results: కిషోరి లాల్ శర్మకు ప్రియాంక ఎమోషనల్ పోస్ట్..

అమేథి: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ (Amedhi) నియోజవకవర్గంలో ఆ పార్టీ గెలుపు ఖాయమంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ (Kishori Lal Sharama) గెలుపు దాదాపు ఖాయం కావడంతో ఆయన తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanaka Gandhi Vadra) 'అడ్వాన్స్ గ్రీటింగ్స్' చెప్పారు. ''కిషోరి భాయ్... మీ గెలుపు ఖాయమని నాకు ముందే తెలుసు'' అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.


''కిషోరి భాయ్, మొదట్నించీ నాకు మీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు. మీరు నెగ్గుతారని చెబుతూనే వచ్చాను. మీకూ, ఆమేథీలోని నా సోదర సోదరీమణులకు అభినందనలు'' అని ప్రియాంక ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో ఎన్నికల కమిషన్ డాటా ప్రకారం బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరి లాల్ శర్మ 90,000కు పైగా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తల్లో సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే రాయబరేలి, అమేథిలో ప్రియాంక గాంధీ రెండు వారాల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. కిషోరి లాల్ శర్మ తరఫున, తన సోదరుడు, రాయబరేలి అభ్యర్థి రాహుల్ గాంధీ తరఫున రోడ్‌షోలలో కూడా పాల్గొన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 03:51 PM