Share News

BJP: మమతా.. మీ రేటెంత? అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - May 17 , 2024 | 12:46 PM

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తమ్లూక్ బీజేపీ అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు?’ అని ప్రశ్నించారు. బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ ఎన్నికల ప్రచారంలో అభిజిత్ గంగోపాధ్యాయ ఈ వ్యాఖ్యలు చేశారు.

BJP: మమతా.. మీ రేటెంత? అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

కోల్‌కత: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తమ్లూక్ బీజేపీ అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు?’ అని ప్రశ్నించారు. బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ ఎన్నికల ప్రచారంలో అభిజిత్ గంగోపాధ్యాయ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలను అగౌవరపరిచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ టీఎంసీ మండి పడుతోంది. దీనిపై టీఎంసీ నేత శాంతాను సేన్ స్పందించారు.

ఆరో దశ బరిలో 92 మంది మహిళలు


ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉన్న మాజీ న్యాయమూర్తి మహిళా ముఖ్యమంత్రిని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని శాంతాను సేన్ విమర్శించారు. బీజేపీ పాలనలో మహిళలను ఈ విధంగా అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు అభిజిత్ గంగోపాధ్యాయ చేయలేదని ఇది ఫేక్ వీడియో అంటూ బీజేపీ కొట్టిపారేస్తోంది. ఫేక్ వీడియోలను విడుదల చేసి బీజేపీని బద్నాం చేయడానికి టీఎంసీ ప్రయత్నిస్తోందంటూ ఆ పార్టీ రివర్స్ దాడికి దిగింది. ఇలాంటి ప్రయత్నాలేవీ ఎన్నికల్లో సత్ఫలితాలను ఇవ్వవంటూ బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు.

Read more National News and Telugu News

Updated Date - May 17 , 2024 | 12:55 PM