Share News

Navya : రోజుకు ఎన్ని పోషకాలు?

ABN , Publish Date - May 21 , 2024 | 12:13 AM

ఆహారంలో సరిపడా పోషకాలున్నప్పుడే అది సమతులాహారం అవుతుంది. అందుకోసం శాకాహారులైతే రోజు మొత్తంలో 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పుదినుసులు, 35 గ్రాముల నట్స్‌, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి.

Navya : రోజుకు ఎన్ని పోషకాలు?

తెలుసుకుందాం

ఆహారంలో సరిపడా పోషకాలున్నప్పుడే అది సమతులాహారం అవుతుంది. అందుకోసం శాకాహారులైతే రోజు మొత్తంలో 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పుదినుసులు, 35 గ్రాముల నట్స్‌, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి.

మాంసాహారులైతే 260 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు, 55 గ్రాముల పప్పుదినుసులు, 70 గ్రాముల చికెన్‌/మాంసం, 30 గ్రాముల నట్స్‌, సీడ్స్‌, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి. అలాగే ఆహారంలోని పోషకాలు నష్టపోకుండా అదే పనిగా బియ్యం, పప్పుదినుసులను నీళ్లలో కడగకూడదు.

అలాగే కూరగాయలు, పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోకుండా, పెద్దవిగా కోసుకోవాలి. కోసిన వెంటనే వండుకోవాలి, లేదా తినేయాలి. గిన్నెల మీద మూత ఉంచి వండుకోవాలి. లేదా కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఓవెన్‌లో వంట గురించి కొందరికి అపోహలుంటాయి. సంప్రదాయబద్ధమైన వంట విధానాల్లో జరిగే పోషక నష్టానికీ, మైక్రోఓవెన్‌లో జరిగే పోషక నష్టానికి వ్యత్యాసం ఎంతో తక్కువ.

Updated Date - May 21 , 2024 | 12:14 AM