Share News

NRI News: అట్లాంటాలో విజయవంతమైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆత్మీయ అభినందన సభ

ABN , Publish Date - Aug 29 , 2024 | 09:25 PM

అమెరికా అట్లాంటాలోని స్థానిక సంక్త్రాంతి రెస్టారెంట్ బాంక్వెట్ హాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. శ్రీనివాస్ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

NRI News: అట్లాంటాలో విజయవంతమైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆత్మీయ అభినందన సభ

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అట్లాంటాలోని స్థానిక సంక్త్రాంతి రెస్టారెంట్ బాంక్వెట్ హాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. శ్రీనివాస్ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అట్లాంటా వాసి, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఐన వెనిగండ్ల రాము.. మొన్న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నిలబడి సుమారు 53 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచి మొదట సారిగా అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటా విచ్చేసిన సందర్భంగా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వందల కార్లతో ర్యాలీగా వెనిగండ్ల రామును సమావేశ మందిరానికి తీసుకొచ్చారు. తెలుగింటి ఆడపడుచులు ఘన స్వాగతం పలికారు.


కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విగ్రహానికి.. వెనిగండ్ల రాము, ఆయన శ్రీమతి సుఖద వెనిగండ్ల పూలమాలలు వేసి, నివాళుర్పించరు. అట్లాంటా నాయకులు శ్రీనివాస్ లావు , అంజయ్య చౌదరి లావు , మల్లిక్ మేదరమెట్ల , సతీష్ ముసునూరి, సురేష్ ధూళిపూడి వేదికను అలంకరించారు.


తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఎన్నారై అట్లాంటా టీడీపీ నాయకులు శ్రీనివాస్ లావు, మల్లిక్ మేదరమెట్ల , సతీష్ ముసునూరి. ఎన్నారై అట్లాంటా జనసేన నాయకులు సురేష్ ధూళిపూడి, సురేష్ కరోతు, బీజేపీ అట్లాంటా నాయకులు కార్తికేయ బండారు అతిథుల్ని ఉద్దేశించి ప్రసంగించారు . ఈ కార్యక్రమానికి సురేష్ పెద్ది, సుజాత ఆలోకం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

nri.jpg


గుడివాడ ఎమ్మెల్యే రాము వెనిగండ్ల మాట్లాడుతూ గత నాలుగు పర్యాయాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని గుడివాడ వాసుల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని, తన అనుభవాలని సభికులకు శ్రీమతి సుఖద వెనిగండ్ల వివరించి ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్ధికి, మరీ మఖ్యంగా గుడివాడ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. గుడివాడ పుట్టిన ప్రదేశం కాగా.. తన ఉన్నతికి ఎంతో కారణమైన అట్లాంటా కూడా తనకి పుట్టిన ఊరుతో సమానమన్నారు. మీ అందరి ప్రేమ అభిమానాలు వెలకట్టలేనివి అని చెప్పారు.

nri2.jpg

తాను పుట్టిన గుడివాడలో వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇప్పుడు శాసన సభ్యుడిగా తనకి అవకాశం ఇచ్చిన టీడీపీ అధ్యక్షులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇతర కూటమి నాయకులకి ధన్యవాదములు తెలిపారు. తన గెలుపునకు అట్లాంటా మిత్రులు వెన్నుదన్నుగా నిలిచి ఎంతో వ్యయ ప్రయాసలతో గుడివాడ వరకు వచ్చి నైతిక మద్దతు తెలిపారని, వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు ద్వారానా తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇప్పటివరకు గుడివాడ ప్రజలు కనీస సౌకర్యాలకి కూడా నోచుకోలేదన్నారు. ప్రజల అవసరాలని గాలికి వదిలేసి.. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే బూతులతో సమాధానం ఇస్తూ, అణచురలతో దౌర్జన్యం చేయటంతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. దీంతోనే తనను గుడివాడ చరిత్ర లో భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. గుడివాడ ప్రజల రుణం ఈ జీవితం లో తీర్చుకోలేనని, వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుడివాడ గడ్డను అభివృద్ధి అడ్డాగా మారుస్తానని తెలిపారు. గుడివాడ ప్రజలతో పాటూ అట్లాంటాలోని వారికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.


అట్లాంటా నాయకులు మాట్లాడతూ మనలో ఒకరు అయిన రాము.. ప్రజా సేవకి ముందుకు రావటం, టీడీపీ అవకాశం ఇవ్వటం, గుడివాడ ప్రజలు రామును అత్యంత మెజారిటీతో గెలిపించటం.. అట్లాంటా వాసులకి ఎంతో గర్వకారణమని చెప్పారు. రాము గెలిచాక ప్రపంచ నలుమూలల ఉన్న పరిచయస్తులు, అభిమానులు ఫోన్ చేసి రాము గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఆ అనుభూతి వర్ణించలేమని చెప్పారు. రాముకు తమ సహాయ, సహకారాలు అన్ని వేళలా ఉంటాయన్నారు. చివరగా వ్యాఖ్యాతలు , సభికులు అడిగిన పలు ప్రశ్నలకి వెనిగండ్ల రాము దంపతులు ఎంతో విపులంగా సమాధానాలు చెప్పటం వచ్చిన అతిథుల్ని ఎంతో ఆకట్టుకుంది. ఈ ఆత్మీయ సభని విజయవంతం చేయడానికి సహకరించిన మురళి బొడ్డు, అనిల్ యలమంచిలి, మధుకర్ యార్లగడ్డ, వినయ్ మద్దినేని , భరత్ మద్దినేని మరియు మిత్రులందరికీ సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Aug 29 , 2024 | 09:26 PM