Share News

AP Politics: వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి ‘కాపు’!!

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:26 AM

కాపునకు వైసీపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే.

AP Politics: వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి ‘కాపు’!!

అనంతపురం : కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డితో అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. కాపునకు వైసీపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రఘువీరారెడ్డితో కాపు రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. రఘువీరారెడ్డి నేతృత్వంలో ముందుగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ను కలుస్తారని సమాచారం.


Kapu-With-Raghuveera.jpg

కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కాపు భావిస్తున్న నేపథ్యంలో... ముందుగా ఆ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ సభకు వైఎస్‌ షర్మిల హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. ఆమె సమక్షంలోనే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కాగా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రఘువీరారెడ్డితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో తాను రఘువీరారెడ్డిని కలిసేందుకు వచ్చానని ఎమ్మెల్యే కాపు మీడియాతో చెప్పారు.

Kapu-Ramachandra-Reddy.jpg

Updated Date - Jan 10 , 2024 | 11:35 AM