Share News

Viral Video: వడ పావ్ తినడానికి వెళ్లి.. రూ.5లక్షల బంగారం పొగొట్టుకున్న దంపతులు..

ABN , Publish Date - Aug 31 , 2024 | 04:29 PM

దొంగతనాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. మన దగ్గర బంగారం, నగదు లేదా ఏదైనా ఇతర వస్తువులు పట్టుకుని ఒక సెకను ఆదమరిచినా చాలు..

Viral Video: వడ పావ్ తినడానికి వెళ్లి.. రూ.5లక్షల బంగారం పొగొట్టుకున్న దంపతులు..
Pune Robbery

దొంగతనాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. మన దగ్గర బంగారం, నగదు లేదా ఏదైనా ఇతర వస్తువులు పట్టుకుని ఒక సెకను ఆదమరిచినా చాలు వెంటనే ఆ వస్తువులు చోరికి గురవుతున్నాయి. ఇటీవల కాలంలో పట్టపగలే దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పూణెలో జరిగిన ఓ చోరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పక్కనే మనిషి ఉన్నా.. బంగారాన్ని ఎలా చోరీ చేశారో చూస్తే ఆశ్చర్యపడాల్సిందే. ఓ పథకం ప్రకారం.. పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. చోరీకి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Life Lesson: ఈ 4 విషయాలలో ఎప్పుడూ సిగ్గు పడకండి.. చాలా నష్టపోతారు..!


వడ పావ్ తినడం కోసం..

పూణెకు చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ వడ పావ్ తినడానికి రోడ్డు పక్కన ఆగారు. భర్త వడ పావ్ ఆర్డర్ చేయడానికి వెళ్లగా.. భార్య ద్విచక్ర వాహనం వద్దనే ఉన్నారు. బండికి ముందు బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ తగిలించి ఉంది. దీంతో ఆమె బండి వద్దనే నిల్చుని ఉన్నారు. అయినాసరే ఓ వ్యక్తి బండికి ఉన్న నగల బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యారు. ఆ సంచిలో సుమారు ఐదు లక్షల రూపాయిల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. మంజరిలోని వైట్ ఫీల్డ్ సొసైటీలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను దష్త్రాత్ బాబాలాల్ ధామ్నే, అతని భార్య జయశ్రీ తమ బంగారాన్ని గతంలో బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంటికి వెళ్తుండగా పూణె- షోలాపూర్ రోడ్డులో ఉన్న వడ పావ్ దుకాణం వద్ద ఆగారు. దష్త్రాత్ బాబాలాల్ తినడం కోసం వెళ్లగా.. ఆహె భార్య జయశ్రీ స్కూటర్ వద్దనే ఉన్నారు.

Viral Video: వాటర్ బాటిల్‌తో రోడ్డు పక్కకు వెళ్లి.. ఈ యువతి చేసిన పనికి అంతా షాక్..


అకస్మాతుగా వచ్చి..

తెల్లటి చొక్కా ధరించిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ద్విచక్ర వాహనం సమీపంలో తిరుగుతూ కనిపించాడు. జయశ్రీ స్కూటర్ వద్దనే ఉండగా.. వెనకాల మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ఆమె దృష్టిని మరల్చే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. స్కూటర్ వద్ద ఉన్న మహిళను పిలుస్తూ వెనకాల ఏదో పడిందని చెప్పడంతో.. ఆమె బండి వెనకవైపునకు వెళ్లి.. ఏమైందా అని చూసే లోపు.. తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి బండి ముందు భాగంలో ఉన్న నగల బ్యాగ్‌తో పరారయ్యాడు. బంగారు ఆభరణల బ్యాగ్‌ తీసుకుని పరిగెడుతుండగా గమనించిన జయశ్రీ గట్టిగా అరవడం ప్రారంభించారు. వెంటనే చుట్టుపక్కల జనం వచ్చినప్పటికీ అప్పటికే దొంగ పారిపోయాడు. ఈ వీడియో పోస్టు చేసినప్పటి నుంచి దాదాపు పది లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. దురదృష్టకర సంఘటన అని కొందరు కామెంట్ చేయగా.. ఆభరణాలను మరింత భద్రంగా ఉంచాల్సిందని కామెంట్స్ చేశారు.


Viral Video: అది చెయ్యా? ఉక్కు కడ్డీనా? ట్రాక్టర్ పైకి ఎక్కించుకుని ఆ వ్యక్తి చేసిన స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Aug 31 , 2024 | 04:29 PM