Share News

Viral Video: ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ.. నెటిజన్లు ఎందుకు విమర్శలు చేస్తున్నారంటే..

ABN , Publish Date - May 22 , 2024 | 04:02 PM

ప్రస్తుతం మన దేశం భయంకరమైన ఉష్ణోగ్రతలతో ఉడికిపోతోంది. మునుపెన్నడూ లేని తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ భారతదేశం ఇటీవల కొంత చల్లబడినప్పటికీ, ఉత్తరాదిన ఇప్పటికీ 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Viral Video: ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ.. నెటిజన్లు ఎందుకు విమర్శలు చేస్తున్నారంటే..
Making omelette on the road

ప్రస్తుతం మన దేశం భయంకరమైన ఉష్ణోగ్రతలతో (Summer) ఉడికిపోతోంది. మునుపెన్నడూ లేని తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి (Heat wave). దక్షిణ భారతదేశం ఇటీవల కొంత చల్లబడినప్పటికీ, ఉత్తరాదిన ఇప్పటికీ 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ వేడి గురించి పలువురు వ్యక్తులు రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ ఎండ వేడికి స్టవ్ అవసరం లేదంటూ ఆరు బయట వంటలు చేసి వీడియోలు రూపొందించారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


tejalmodi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ రోడ్డును నీటితో క్లీన్ చేసింది. ఎర్రటి ఎండలో రోడ్డుకు నూనె రాసింది. అనంతరం రెండు గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్‌లా వేసింది. ఆ వీడియోలో తయారైన ఆమ్లెట్‌ను చూపించనప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 80 లక్షల మందికి పైగా వీక్షించారు (Making omelette on the road).


1.1 లక్షల మందికి పైగా ఈ వైరల్ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``విచిత్రమైన మార్గాల్లో దృష్టిని ఆకర్షించే ప్రయత్నం``, ``అనవసరంగా రెండు గుడ్లు వేస్ట్``, ``ఈ ఎండలకు పూర్తిగా మానవ తప్పిదాలే కారణం``, ``రోడ్లపై ఇలా చేయడం వాహనదారులకు సురక్షితం కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!


Viral Video: దేవుడా.. ఈ వంటకం ఏంటో తెలిస్తే కంట్లో నీళ్లు తిరగాల్సిందే.. అవాక్కవుతున్న నెటిజన్లు!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 04:02 PM