Viral Video: ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ.. నెటిజన్లు ఎందుకు విమర్శలు చేస్తున్నారంటే..
ABN , Publish Date - May 22 , 2024 | 04:02 PM
ప్రస్తుతం మన దేశం భయంకరమైన ఉష్ణోగ్రతలతో ఉడికిపోతోంది. మునుపెన్నడూ లేని తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ భారతదేశం ఇటీవల కొంత చల్లబడినప్పటికీ, ఉత్తరాదిన ఇప్పటికీ 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
![Viral Video: ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ.. నెటిజన్లు ఎందుకు విమర్శలు చేస్తున్నారంటే..](https://media.andhrajyothy.com/media/2024/20240511/egg_e83dfc1a67.jpg)
ప్రస్తుతం మన దేశం భయంకరమైన ఉష్ణోగ్రతలతో (Summer) ఉడికిపోతోంది. మునుపెన్నడూ లేని తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి (Heat wave). దక్షిణ భారతదేశం ఇటీవల కొంత చల్లబడినప్పటికీ, ఉత్తరాదిన ఇప్పటికీ 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ వేడి గురించి పలువురు వ్యక్తులు రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ ఎండ వేడికి స్టవ్ అవసరం లేదంటూ ఆరు బయట వంటలు చేసి వీడియోలు రూపొందించారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
tejalmodi అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ రోడ్డును నీటితో క్లీన్ చేసింది. ఎర్రటి ఎండలో రోడ్డుకు నూనె రాసింది. అనంతరం రెండు గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్లా వేసింది. ఆ వీడియోలో తయారైన ఆమ్లెట్ను చూపించనప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను 80 లక్షల మందికి పైగా వీక్షించారు (Making omelette on the road).
1.1 లక్షల మందికి పైగా ఈ వైరల్ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``విచిత్రమైన మార్గాల్లో దృష్టిని ఆకర్షించే ప్రయత్నం``, ``అనవసరంగా రెండు గుడ్లు వేస్ట్``, ``ఈ ఎండలకు పూర్తిగా మానవ తప్పిదాలే కారణం``, ``రోడ్లపై ఇలా చేయడం వాహనదారులకు సురక్షితం కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!
Viral Video: దేవుడా.. ఈ వంటకం ఏంటో తెలిస్తే కంట్లో నీళ్లు తిరగాల్సిందే.. అవాక్కవుతున్న నెటిజన్లు!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..