Share News

India vs Bangladesh: భారత్, బంగ్లా రెండో టెస్ట్ రెండో రోజు షాకింగ్ నిర్ణయం

ABN , Publish Date - Sep 28 , 2024 | 01:45 PM

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. ఇప్పుడు రెండో రోజు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

India vs Bangladesh: భారత్, బంగ్లా రెండో టెస్ట్ రెండో రోజు షాకింగ్ నిర్ణయం
2nd Test India vs Bangladesh

భారత్-బంగ్లాదేశ్(India vs Bangladesh) జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గత శుక్రవారం (సెప్టెంబర్ 27) ప్రారంభమైంది. తొలిరోజే వర్షం కురిసింది. వర్షం కారణంగా తొలిరోజు ఆటను 2 గంటల ముందుగానే ముగించాల్సి వచ్చింది. దీంతోపాటు ఆట ప్రారంభం కూడా గంట ఆలస్యమైంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రాణిస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.


ఫాస్ట్ బౌలర్లు

మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ జట్టుకు అజేయంగా నిలిచారు. మోమినుల్ 81 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 40 పరుగులు, ముష్ఫికర్ 13 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 6 పరుగులు చేశారు. తొలిరోజు భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ ఫాస్ట్ బౌలర్లు విజయం సాధించలేదు. కానీ ఆకాశ్ దీప్ రెండు వికెట్లను పడగొట్టగా, ఆ తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు. ఇప్పుడు రెండో రోజు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించాలని భారత బౌలర్లు భావిస్తున్నారు.


రెయిన్ రెయిన్..

కానీ రెండో టెస్టు రెండో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. వాస్తవానికి శనివారం ఉదయం నుంచి కాన్పూర్‌లో వర్షం కురుస్తోంది. జట్లు స్టేడియం నుంచి తిరిగి హోటల్‌కు చేరుకున్నాయి. ఇప్పటివరకు రెండో రోజు వర్షం కారణంగా ఇంకా ఆట మొదలు కాలేదు. మొదటి సెషన్ గేమ్ వాష్ అవుట్ అయింది. టీ విరామం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మొదలుకానుంది. ప్రస్తుతం కాన్పూర్‌లో వర్షం ఆగిపోయింది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కావచ్చు. అక్యూవెదర్ ప్రకారం రెండవ రోజు అంటే సెప్టెంబర్ 28న కాన్పూర్‌లో దాదాపు 80 శాతం వర్షం పడే అవకాశం ఉంది.


ఇరు జట్లు

భారత్‌ జట్టు ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.

బంగ్లాదేశ్ జట్టులో నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ కలరు.


ఇవి కూడా చదవండి:

Utility News: మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ చేస్తే నిమిషాల్లోనే సూపర్‌ఫాస్ట్‌..

Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..


Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Sports News and Latest Telugu News

Updated Date - Sep 28 , 2024 | 01:50 PM