Share News

Jasprit Bumrah: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కీలక అప్‌డేట్.. ఈసారి బుమ్రా

ABN , Publish Date - Oct 02 , 2024 | 03:17 PM

కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై 6 వికెట్లు తీసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే కొత్త నంబర్ 1 టెస్ట్ బౌలర్ అయ్యాడు. బుమ్రా ఖాతాలో ఇప్పుడు 870 రేటింగ్ పాయింట్లు ఉండగా, అశ్విన్‌కు దీని కంటే ఒక పాయింట్ తక్కువగా ఉండటం విశేషం.

Jasprit Bumrah: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కీలక అప్‌డేట్.. ఈసారి బుమ్రా
Jasprit Bumrah

భారత్, బంగ్లాదేశ్‌లు ఇటివల రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడ్డాయి. ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా, ఆ తర్వాత కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ టెస్టు సిరీస్‌లో ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజాలు బౌలింగ్‌లో అద్భుతాలు చేశారు. బంగ్లాదేశ్‌పై అశ్విన్, బుమ్రా(jasprit Bumrah) ఇద్దరూ దాదాపు సమానంగా వికెట్లు పడగొట్టారు.


జస్ట్ మిస్

ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మాత్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆర్ అశ్విన్‌ను రెండవ స్థానానికి చేరుకున్నాడు. కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సందర్భంగా ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండోసారి అగ్రస్థానం దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో అశ్విన్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ క్రమంలో బుమ్రా 870 రేటింగ్ పాయింట్ల కంటే అశ్విన్ కేవలం ఒక పాయింట్ వెనుకబడి ఉండటం విశేషం.


జాబితాలో

ఈ ఏడాది మార్చిలో ఆర్‌ అశ్విన్‌ నంబర్‌ 1 టెస్టు బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు అశ్విన్‌ నుంచి నంబర్‌ 1 కిరీటాన్ని బుమ్రా లాగేసుకున్నాడు. టెస్టు బౌలర్లలో బుమ్రా రెండోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టాప్-10 బౌలర్ల జాబితాలో శ్రీలంక ఆటగాడు ప్రభాత్ జయసూర్య 8వ స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు.

జైస్వాల్

టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా కీలక మార్పులు కనిపించాయి. కాన్పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. జాబితాలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ టాప్ 10కి తిరిగి వచ్చాడు. రిషబ్ పంత్ 9వ స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 15వ స్థానంలో ఉన్నాడు.


ఆల్ రౌండర్ల జాబితాలో

గాలేలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 2-0తో సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 16 టెస్టు మ్యాచ్‌ల తర్వాత బౌలర్ల జాబితాలో సంయుక్తంగా ఏడో స్థానానికి ఎగబాకాడు. ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ విధంగా ఇద్దరు బంగ్లాదేశీయులు మొదటి ఐదు స్థానాల్లో చేరారు. వారి ప్రముఖ సహచరుడు షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.


ఇవి కూడా చదవండి:

Babar Azam: కెప్టెన్సీ వదిలేసిన బాబర్ ఆజామ్.. అయినా ఆగని ట్రోలింగ్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 02 , 2024 | 03:27 PM