Share News

TS News: నేడు కొత్తగూడెం, మణుగూరులలో నలుగురు మంత్రుల పర్యటన

ABN , Publish Date - Jun 27 , 2024 | 07:05 AM

కొత్తగూడెం, మణుగూరులో నేడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. అమృత్ 2.0 గ్రాంట్‌లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుంది. కొ

TS News: నేడు కొత్తగూడెం, మణుగూరులలో నలుగురు మంత్రుల పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం, మణుగూరులో నేడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. అమృత్ 2.0 గ్రాంట్‌లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుంది. కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో గోదావరి వరదలు ముందస్తు చర్యలపై మంత్రుల సమీక్షా సమావేశం జరగనుంది. మణుగూరులో ఇటీవలే కన్నుమూసిన పద్మశ్రీ సకిని రామ చంద్రయ్య కుటుంబ సభ్యులను  పరామర్శించనున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 07:06 AM