Share News

Raj Tarun: హీరో రాజ్‌ తరుణ్‌-లావణ్య మధ్య ఏం జరిగింది.. మూడో వ్యక్తి ఎవరు..!?

ABN , Publish Date - Jul 06 , 2024 | 02:59 AM

హీరో రాజ్‌ తరుణ్‌ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. 2012 నుంచి తమ ఇద్దరి మధ్య అనుబంధం ఉందని.. 2014 మే 11 నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నామని ఆమె పేర్కొంది.

Raj Tarun: హీరో రాజ్‌ తరుణ్‌-లావణ్య మధ్య ఏం జరిగింది.. మూడో వ్యక్తి ఎవరు..!?

  • 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాం

  • ఇప్పుడు ఓ హీరోయిన్‌తో తిరుగుతున్నాడు

  • నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో లావణ్య అనే మహిళ ఫిర్యాదు

  • డబ్బు కోసమే డ్రామాలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడింది

  • ఒకప్పుడు ఆమెతో రిలేషన్‌లో ఉన్నమాట నిజమేగానీ.. ఇప్పుడు లేను

  • ఆరోపణలపై హీరో రాజ్‌తరుణ్‌

నార్సింగ్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): హీరో రాజ్‌ తరుణ్‌ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. 2012 నుంచి తమ ఇద్దరి మధ్య అనుబంధం ఉందని.. 2014 మే 11 నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నామని ఆమె పేర్కొంది. పదకొండేళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నామని.. ఇద్దరం శారీరకంగా, మానసికంగా దగ్గరై ఆనందంగా ఉండేవారమని వివరించింది. ‘‘అయితే.. రాజ్‌తరుణ్‌ ఈ మధ్య హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాతో కలిసి తిరుగుతున్నాడని నాకు తెలిసింది. ‘తిరగబడర సామి’ సినిమా షూటింగ్‌ నుంచి వారిద్దరి మధ్య ఎఫైర్‌ మొదలైంది. రాజ్‌తరుణ్‌ ఆమెను కలిసేందుకు తరచుగా ముంబై వెళ్లేవాడు. ఆమె హైదరాబాద్‌కు వస్తుండేది.


వారిద్దరూ ఇక్కడ ఒక డైరెక్టర్‌ ఇంట్లో కలిసేవారు. ఈ విషయం నాకు తెలిసి నిలదీసినప్పటి నుంచీ అంతా మారిపోయింది. రాజ్‌ నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఆమె కూడా నన్ను టార్గెట్‌ చేసింది. రాజ్‌ను వదిలేయాలంటూ మాల్వి కుటుంబసభ్యులంతా నన్ను బెదిరించారు. ఇదంతా 2023 అక్టోబరులో జరిగింది. ఇదంతా జరుగుతుండగానే.. నాకు సంబంధం లేని ఒక కేసులో నన్ను ఇరికించారు. ఆ కేసులో 43 రోజులు జైల్లో ఉన్నా. బయటకు వచ్చేసరికి అంతా మారిపోయింది. రాజ్‌ మేమున్న ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడు. మేమిద్దరం త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ.. ఇంతలోనే ఇలా జరిగింది.’’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


వేరే వ్యక్తితో..

తనపై ఫిర్యాదు చేసిన లావణ్యతో ఒకప్పుడు తాను రిలేషన్‌లో ఉన్న మాట నిజమేగానీ.. ప్రస్తుతం ఆమె మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని హీరో రాజ్‌తరుణ్‌ చెప్పారు. లావణ్య తనపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. 2017 తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని తేల్చిచెప్పారు. ‘‘నా ఇంట్లో నేను కింది అంతస్తులో ఉంటే ఆమె మస్తాన్‌సాయి అనే వ్యక్తితో రెండో అంతస్తులో ఉండేది. ఆమె డ్రగ్స్‌కు అలవాటు పడింది. ఆమెపై గతంలో డ్రగ్స్‌ కేసు కూడా నమోదైంది. తనను పెళ్లి చేసుకోవట్లేదంటూ మస్తాన్‌సాయిపై ఆమె గతంలో గుంటూరులో కేసు కూడా పెట్టింది. అప్పట్లో ఆమెకు నేను కూడా సహకరించాను. 11 సంవత్సరాలు ఆమెతో కలిసి ఉన్నానని. గుళ్లో మా ఇద్దరికీ పెళ్లయిందని చెప్పడం అబద్ధం. నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తల్లో నాకు సహాయం చేసింది. అందుకు కృతజ్ఞత ఉండడం వల్లనే ఆమెను నా ఇంటిలో ఉండనిచ్చాను. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నా పరువు ఎక్కడ పోతుందోనని భరిస్తూ వచ్చా. కానీ, డ్రగ్స్‌కు అలవాటు పడిన తర్వాత ఆమె ఫ్రెండ్‌ సర్కిల్‌ పెద్దదైంది. ఇదంతా చూసి తట్టుకోలేక నేను ఇంట్లోంచి బయటకు వెళ్లాలని అనుకున్నా. మాల్వీతో నేను సహజీవనం చేస్తున్నానని లావణ్య ఆరోపించడంలో అర్థం లేదు.


ఎందుకంటే నేను ఉండేది హైదరాబాద్‌లో. ఆమె ఉండేది ముంబైలో. లావణ్య నన్ను ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇస్తూ వచ్చా. ఆ తర్వాత నాకు అర్థమైంది.. ఇది మరీ ఎక్కువైపోతోందని. దీంతో డబ్బులు ఇవ్వడం మానేశా. ఆవిడకు బేసిగ్గా నా దగ్గర నుంచి డబ్బులు కావాలి. అయితే.. నేను ఇటీవలే లావణ్య గురించి డీసీపీతో మాట్లాడాను. అప్పట్నుంచి.. నేను తనను ఎక్కడ ఇల్లు ఖాళీ చేయిస్తానో అనే భయంతో ఆమె ఇలా రచ్చ చేస్తోంది. ఆమెకు నేనే కావాలనుకుంటే.. మస్తాన్‌సాయి తనను పెళ్లిచేసుకోవాలంటూ గుంటూరు పీఎ్‌సలో ఎందుకు ఫిర్యాదు చేస్తుంది? ఇదంతా నా మంచికే. జనాలకు అంతా తెలిసింది. నేను కూడా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. ఆమెకు ఇప్పటివరకూ నేను ఎంత డబ్బు ఇచ్చానో చెప్పే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నాకు ఆమెతో పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకుంటానంటూ నేనెప్పుడూ ఆమెను మోసం చేయలేదు’’ అని రాజ్‌తరుణ్‌ వివరణ ఇచ్చారు.

Updated Date - Jul 06 , 2024 | 07:59 AM