Share News

Bhatti Vikramarka: జపాన్‌ చేరుకున్న భట్టి విక్రమార్క..

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:02 AM

వారం రోజుల అమెరికా పర్యటన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జపాన్‌కు చేరుకుంది.

Bhatti Vikramarka: జపాన్‌ చేరుకున్న భట్టి విక్రమార్క..

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల అమెరికా పర్యటన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జపాన్‌కు చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం హానెడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు.


పర్యావరణహిత పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్‌ టెక్నాలజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై అధ్యయనం కోసం మూడు రోజులపాటు ఈ బృందం జపాన్‌లోని పలు పరిశ్రమలను సందర్శించి, కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానుంది.

Updated Date - Oct 01 , 2024 | 04:02 AM