Share News

Hyderabad: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్‌రెడ్డి..

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:50 AM

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)గా సి.సుదర్శన్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వికా్‌సరాజ్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. 2

Hyderabad: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్‌రెడ్డి..

  • ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

  • వికాస్‌రాజ్‌ రిలీవ్‌.. త్వరలో కీలక

  • బాధ్యతలు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)గా సి.సుదర్శన్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వికా్‌సరాజ్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. 2002 బ్యాచ్‌ ఐఏఎస్‌ అయిన సుదర్శన్‌రెడ్డిని గత నెల 24న సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి(సర్వీసె్‌స)గా ప్రభుత్వం నియమించింది. ఇంతలోనే ఆయనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వికా్‌సరాజ్‌ తిరిగి ప్రభుత్వ సేవల్లో చేరుతారంటూ ఇటీవలే ‘ఆంధ్రజ్యోతి’ ఓ వార్తను ప్రచురించింది. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో చేరారు. త్వరలోనే ఆయనకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 06 , 2024 | 03:50 AM