Share News

Lok Sabha Polls 2024:తెలంగాణలో పోలింగ్ ప్రశాంతం: డీజీపీ రవిగుప్తా

ABN , Publish Date - May 13 , 2024 | 09:51 PM

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఈమేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అదనపు డీజీపీలు మహేష్ ఎం భగవత్, సంజయ్ కుమార్ జైన్‌లు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్‌ను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు.

Lok Sabha Polls 2024:తెలంగాణలో పోలింగ్ ప్రశాంతం: డీజీపీ రవిగుప్తా
DGP Ravi Gupta

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ రవి గుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఈమేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అదనపు డీజీపీలు మహేష్ ఎం భగవత్, సంజయ్ కుమార్ జైన్‌లు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్‌ను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు.


ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా సాయంత్రం 4:00 గంటలకు పోలింగ్ ముగిసిందని డీజీపీ అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు కృషి చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని డీజీపీ అభినందించారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా ఈరోజు వరకు సుమారుగా రూ. 191 కోట్లకు పైగా నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ రవిగుప్తా తెలిపారు.

Lok Sabha Polls 2024: మాధవీలతపై ఈసీ సీరియస్.. కేసు నమోదు.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..!

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 09:55 PM