Share News

Sircilla: వేములవాడ రాజన్నకు రూ.35 లక్షల విరాళం

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు గురువారం రూ.35 లక్షల విరాళం అందజేసి మంచి మనసు చాటుకున్నారు.

Sircilla: వేములవాడ రాజన్నకు రూ.35 లక్షల విరాళం

  • నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.25 లక్షలు, గోశాలకు రూ.10 లక్షలు

  • మంచి మనసు చాటుకున్న సికింద్రాబాద్‌ వాసి

వేములవాడ కల్చరల్‌, జూన్‌ 27: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు గురువారం రూ.35 లక్షల విరాళం అందజేసి మంచి మనసు చాటుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన గల్లా గుండయ్య అనే భక్తుడు.. రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌ కోసం రూ.25 లక్షలు, గోశాల నిర్వహణ కోసం రూ.10 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ఏఈవో నవీన్‌కు అందజేశారు. అంతకుముందు గుండయ్య కుటుంబసభ్యులతో రాజన్నను దర్శించుకున్నారు.


ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయన్ను సన్మానించారు. అనంతరం ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

Updated Date - Jun 28 , 2024 | 03:33 AM