Share News

Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్‌ మృతి..

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:46 AM

గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్‌, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు.

Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్‌ మృతి..

  • అస్వస్థతతోనే 11 కి.మీ దూరం డ్రైవింగ్‌

  • జహీరాబాద్‌ వద్ద నిలిపి బస్సు వెనక సీట్లోకి..

  • అక్కడ పడుకునే ప్రయత్నం చేస్తూ కిందపడి మృతి

జహీరాబాద్‌, జూలై 12: గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్‌, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ డిపో ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. మృతుడు కర్ణాటకలోని బస్వకల్యాణ్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మహదేవ్‌ (45). ఆ ఆర్టీసీ బస్సును మహదేవ్‌ గురువారం సాయంత్రం జహీరాబాద్‌ శివారు సత్వార్‌లోని ఓ దాబా వద్ద భోజనం కోసం ఆపాడు.


ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో కొందరు దాబాలో భోజనం చేశారు. డ్రైవర్‌ మహదేవ్‌ కూడా భోజనం చేస్తుండగానే ఛాతీలో నొప్పిగా ఉందంటూ ప్రయాణికులకు చెప్పాడు. ఆ తర్వాత ప్రయాణికులను ఎక్కించుకొని 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్‌కు సురక్షితంగా చేర్చాడు. తర్వాత మహదేవ్‌ తనకు అలసటగా ఉందంటూ బస్సు వెనుక సీట్లోకి వచ్చి పడుకునే ప్రయత్నం చేస్తూ కిందపడి మృతిచెందాడు.

Updated Date - Jul 13 , 2024 | 04:46 AM