Share News

Telangana: ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:15 AM

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయనపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు ఫైల్ చేశారు. గాంధీతో పాటు..

Telangana: ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..
MLA Gandhi

హైదరాబాద్, సెప్టెంబర్ 14: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయనపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు ఫైల్ చేశారు. గాంధీతో పాటు.. ఆయన కుమారుడు, సోదరుడిపైనా కేసు నమోదు చేశారు పోలీసులు. మరో ఇద్దరు కార్పొరేటర్లపైన కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్‌తో పాటు.. మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్‌లను నిందితులుగా చేర్చారు పోలీసులు.


ఇదిలాఉండగా.. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, గాంధీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న ధరిమిలా ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లతో భద్రతను ఏర్పాటు చేశారు.


Also Read:

మరికాసేపట్లో హైదరాబాద్‌కు చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం చొరవతో సురక్షితంగా స్వదేశానికి..

ఎంపాక్స్‌కు తొలి టీకా

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 14 , 2024 | 10:15 AM