Share News

బీజేపీ, కాంగ్రె్‌సలతో విధ్వంసం

ABN , Publish Date - May 11 , 2024 | 07:19 AM

రాష్ట్ర వికాసం బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని.. బీజేపీ, కాంగ్రె్‌సలను గెలిపిస్తే విధ్వంసమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు

బీజేపీ, కాంగ్రె్‌సలతో విధ్వంసం

బీజేపీ పంచిన దేవుడి ఫొటొలతో బతుకులు మారుతాయా?

రేవంత్‌ అబద్ధాల కోరైతే.. రాహుల్‌ డబుల్‌ అబద్ధాల కోరు

హుస్నాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌

హుస్నాబాద్‌, మే 10: రాష్ట్ర వికాసం బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని.. బీజేపీ, కాంగ్రె్‌సలను గెలిపిస్తే విధ్వంసమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ చేసింది చెప్పుకోవడానికి ఏం లేక దేవుడి ఫొటోల్లో వారి ఫొటోలు పెట్టుకొని ఇంటింటికీ పంపిణీ చేశారని, ఈ ఫొటోలతో మన బతుకులు మారుతాయా..? అని ప్రశ్నించారు. బడా కార్పొరేట్‌ కంపెనీలకు రూ.14 లక్షల కోట్లు రుణ మాఫీ చేసిన బీజేపీ.. రైతులను అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు.

సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరైతే, రాహుల్‌గాంధీ డబుల్‌ అబద్ధాల కోరని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్‌ వైఫల్యాలను వివరించే క్రమంలో హరీశ్‌ పొరపడ్డారు. ఒక సందర్భంలో కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. పక్కనే ఉన్న వినోద్‌కుమార్‌.. చెవిలో చెప్పడంతో వెంటనే సర్దుకొని కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 11 , 2024 | 07:19 AM