Share News

Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన

ABN , Publish Date - Sep 03 , 2024 | 02:47 PM

Telangana: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వరదల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వరద నష్టంపై సరైన నివేదికలు పంపించాలన్నారు.

Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన
MP Etela rajender

హైదరాబాద్, సెప్టెంబర్ 3: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela rajender) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వరదల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వరద నష్టంపై సరైన నివేదికలు పంపించాలన్నారు. కోతకు గురైన చెరువులను రాష్ట్ర ప్రభుత్వం వెంటమే పునరుద్ధరించాలన్నారు. పశువులకు అపార నష్టం వాటిల్లిందని... ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.

CM Chandrababu: ఎవ్వరినీ వదలను.. మంత్రులు, అధికారులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..


కొట్టుకుపోయిన పంటకే కాకుండా.. నీటిలో నానిన పంటకు సైతం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే సాయం చేయాలన్నారు. ఇళ్ళు కోల్పోయిన వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇద్దరు సీఎంలతో మాట్లాడాలన్నారు. నష్టం తీరును అంచనా వేసి కేంద్రం ఆదుకుంటోందని స్పష్టం చేశారు. వరద బాధితులకు బీజేపీ అండగా ఉంటోందన్నారు. బీజేపీ శ్రేణులు సాహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

Revanth Reddy: ఫామ్ హౌస్‌లో పడుకున్నోడిలా కాను.. చెప్పిందే చేస్తా..

Uttar Pradesh: తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. సీఎం ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 03 , 2024 | 02:51 PM