Share News

Telangana: ఇక కేంద్రంపై యుద్ధమే.. ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. అసెంబ్లీలో రేవంత్ ప్రకటన..

ABN , Publish Date - Jul 24 , 2024 | 08:19 PM

బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందని.. రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ శాసనసభలో జరిగిన చర్చపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Telangana: ఇక కేంద్రంపై యుద్ధమే.. ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. అసెంబ్లీలో రేవంత్ ప్రకటన..
Revanth Reddy

బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందని.. రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ శాసనసభలో జరిగిన చర్చపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఆయన స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కావల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. విభజన హామీల అమలులో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేంద్ర పెద్దలను కలిసి ఎన్నో విజ్ఞప్తులు ఇచ్చామన్నారు. ఎవరి దయా దాక్షిణ్యాలతో తనకు సీఎం పదవి రాలేదన్నారు. ఎవరినో పెద్దన్న అంటే తనకు సీఎం పదవి రాలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిసానని, 18సార్లు కేంద్ర మంత్రులను కలిశామని తెలిపారు.

Telangana: కొంచెం ఓపిక పట్టండి.. రేవంత్‌కు అసహనం ఎందుకో అర్థం కావడంలేదన్న కేటీఆర్..


నిధులు మాత్రమే అడిగాం..

తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ప్రధాని, కేంద్రమంత్రులను కలిశామని.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదని రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పారు. తెలంగాణపై కేంద్రానిది వివిక్ష మాత్రమే కాదని.. కక్ష పూరిత వైఖరన్నారు. కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారని.. ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?


తీవ్ర అన్యాయం..

తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చేది కేవలం 43 పైసలు మాత్రమేనని.. బీహార్‌కు రూ.7.26 పైసలు ఇస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి రూ.3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే... కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1లక్షా 68వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఎంత ఇస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి రూ.22లక్షల 26వేల కోట్లు చెల్లిస్తుంటే కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6లక్షల 42వేల కోట్లు మాత్రమేనన్నారు.

BRS: ఇప్పటి వరకు ఆ చెక్కు బస్ భవన్‌కు చేరలేదు: హరీష్ రావు


యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ.3 లక్షల 41వేల కోట్లు మాత్రమేనని, యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లని రేవంత్ తెలిపారు.


దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువని.. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందన్నారు. దేశం ఐదు ట్రిలియన్‌ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పామన్నారు. మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరామన్నారు. ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని తెలిపారు. సభలో కొన్ని కొందరు పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే మాట్లాడటం శోచనీయమన్నారు. అందరూ ఏకతాటిపై ఉంటేనే కేంద్రప్రభుత్వం మెడలు వంచి నిధులు సాధించుకోవచ్చన్నారు. రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడంలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిమిషం వరకు ప్రయత్నం చేశామని చెప్పారు. తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు.


TS News: తమను వెదకొద్దంటూ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 24 , 2024 | 08:19 PM