Share News

T.HighCourt: వేణుస్వామి పిటిషన్‌పై మరోసారి విచారించనున్న హైకోర్టు

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:08 AM

Telangana: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టు మరోసారి విచారణ చేయనుంది. ఇటీవల వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లగా.. వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళా కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.

T.HighCourt: వేణుస్వామి పిటిషన్‌పై మరోసారి విచారించనున్న హైకోర్టు
Telangana High Court

హైదరాబాద్, ఆగస్టు 21: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టు (Telangana High Court) మరోసారి విచారణ చేయనుంది. ఇటీవల వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లగా.. వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. వేణు స్వామికి నోటీసులు ఇవ్వడానికి ఎలాంటి అర్హత ఉందని గత విచారణలో మహిళా కమిషన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. వేణు స్వామి జ్యోతిష్యాల పేరుతో అసత్య, మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. మరోసారి ఈరోజు వేణుస్వామి పిటిషన్‌‌ను జస్టిస్ నంద బెంచ్ విచారణ చేపట్టనుంది.

Viral: పోలీస్ అంకుల్.. మా నాన్నను జైల్లో పెట్టండి.. తన తండ్రిపై పోలీసులకు కంప్లైంట్ చేసిన ఐదేళ్ల బాలుడు!


కాగా... ఇటీవల నటుడు అక్కనేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..వారు త్వరలో విడిపోతారంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడ్డారు. అసలే సమంతతో విడిపోయి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తమ అభిమాన హీరో జీవితం గురించి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జంట వైవాహిక జీవితంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కొందరు జర్నలిస్టులు, ఫ్యాన్స్ ఆయనపై మహిళా కమిషన్‍కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు సవాల్ చేస్తూ ఆయన హైకోర్టు తలుపు తట్టారు.

Tadipatri: ఏబీఎన్‌ జర్నలిస్టును కాల్చేస్తానన్న వైసీపీ నేత.. పోలీసులు ఏం చేశారో తెలుసా?



గతంలోనే అనేక మంది సెలబ్రెటీల పర్సనల్ లైఫ్‌కు సంబంధించి కూడా వేణుస్వామి పలు వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత వివాహ సమయంలోనూ వారు త్వరలో విడిపోతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అలాగే కొణిదల ఉపాసన, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సహా అనేక మంది గురించి ఆయన తీవ్రంగా మాట్లాడారు. దీనిపై ఆయా హీరో, హీరోయిన్ల ఫ్యాన్స్ అతనిపై నిప్పులు చెరిగారు.


ఇవి కూడా చదవండి...

Arrest: ఐదుగురు సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

Trains: పలురైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 11:17 AM