Share News

Maheswaram : రేపు స్కిల్‌ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:51 AM

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

Maheswaram : రేపు స్కిల్‌ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన

  • రేపు స్కిల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన

కందుకూరు/మహేశ్వరం, జూలై 30(ఆంధ్రజ్యోతి): స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ వర్సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేట రెవెన్యూ పంజగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 57 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం.. నిర్మాణానికి సుమారు రూ.వంద కోట్లు ఖర్చు చేయనుంది. మీర్కాన్‌పేటలో శంకుస్థాపన ఏర్పాట్లను మంగళవారం మాజీ ఎమ్మెల్యే, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.

Updated Date - Jul 31 , 2024 | 05:52 AM