Share News

BRS: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలు

ABN , Publish Date - Jan 26 , 2024 | 03:10 PM

Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

BRS: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలు

సిద్దిపేట, జనవరి 26: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటి క్రితమే మొదలైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్‌సభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కే.కేశవ రావు, నామా నాగేశ్వర్‌రావుతో సహా ఎంపీలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సమావేశంలో పాల్గొన్నారు. తుంటి ఎముకకు శస్త్ర చికిత్స అనంతరం గులాబీ బాస్ తొలి సమావేశం ఇదే.

kcr-mps.jpg

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 26 , 2024 | 03:10 PM