Share News

Crime news: నర్సాపూర్‌ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందుతుడు ఎవరంటే?

ABN , Publish Date - Jun 16 , 2024 | 07:52 AM

నర్సాపూర్‌(Narsapur)లో దారుణం జరిగింది. నెలరోజుల క్రితం జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులను కుమారుడే కడతేర్చారంటూ విచారణలో తేలడంతో పోలీసులు(Police) నిర్ఘాంత పోయారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్ నగర్‌కు చెందిన సాకలి లక్ష్మణ్ విపరీతంగా అప్పులు చేశారు.

Crime news: నర్సాపూర్‌ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందుతుడు ఎవరంటే?

మెదక్: నర్సాపూర్‌(Narsapur)లో దారుణం జరిగింది. నెలరోజుల క్రితం జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులను కుమారుడే కడతేర్చారంటూ విచారణలో తేలడంతో పోలీసులు(Police) నిర్ఘాంత పోయారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్ నగర్‌కు చెందిన సాకలి లక్ష్మణ్ విపరీతంగా అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు బంగారం ఇవ్వాలని తల్లిదండ్రులతో పలుమార్లు గొడవ పడ్డాడు. వారు ఎంతకీ బంగారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులను హత్య చేసి నర్సాపూర్ రాయరావు చెరువు వద్ద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యలపై విచారణ చేపట్టిన పోలీసులు... కుమారుడే హత్య చేశాడంటూ విచారణలో తేల్చారు. దీంతో నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jun 16 , 2024 | 07:52 AM