Share News

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

ABN , Publish Date - Jul 16 , 2024 | 09:13 AM

Telangana: జిల్లాలోని బిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి
Road Accident in kamareddy

కామారెడ్డి జిల్లా, జూలై 16: జిల్లాలోని బిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

CM Chandrababu: ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమావేశం


సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు అరుణ్ (32), రవళి (27), సాయి రెడ్డి (26), శివానంద్ (4), ఆరాధ్య (సంవత్సరం), శివ కుమార్ (24)గా గుర్తించారు. కారు హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి...

Encounter With Terrorists: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు వీరమరణం

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 09:17 AM