Share News

NIMS: కవి, గాయకుడు జయరాజ్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:55 AM

కవి, గాయకుడు జయరాజ్‌.. తీవ్ర అస్వస్థతతో నిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.

NIMS: కవి, గాయకుడు జయరాజ్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌

  • నిమ్స్‌కు తరలింపు

  • మెరుగైన చికిత్స అందించాలన్న మంత్రి దామోదర

హైదరాబాద్‌ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కవి, గాయకుడు జయరాజ్‌.. తీవ్ర అస్వస్థతతో నిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. నిమ్స్‌లోని మెట్టు రంగారెడ్డి బ్లాక్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. జయరాజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శనివారం జయరాజ్‌ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్పను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయరాజ్‌కు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - Jul 21 , 2024 | 04:55 AM