Share News

TG: ఇది ప్రజల విజయం: రఘురాంరెడ్డి

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:37 AM

తనను 4,67,847 ఓట్ల ఆధిక్యతతో గెలిపించింనందుకు ఓటర్లకు, నాయకులకు ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపుకోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు

TG: ఇది ప్రజల విజయం: రఘురాంరెడ్డి

ఖమ్మం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): తనను 4,67,847 ఓట్ల ఆధిక్యతతో గెలిపించింనందుకు ఓటర్లకు, నాయకులకు ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపుకోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరితో పాటు నాయుకలు, కార్యకర్తలు, సీపీఎం, సీపీఐ నాయకులు కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు అహర్నిశలు శ్రమించారని, అందువల్లే ఈ భారీ ఆధిక్యత వచ్చింద న్నారు. ప్రజలు ఇచ్చిన ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. కాగా, ఏపీలో టీడీపీ వి జయం సాధించడంపట్ల మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశా రు. ఖమ్మంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ఆయన పాల్గొని కార్యకర్తలను అభినందించారు.

Updated Date - Jun 05 , 2024 | 06:37 AM