Share News

Mahesh Kumar Goud: సీఎంను కలిసిన టీపీసీసీ కొత్త చీఫ్‌

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:35 AM

టీపీసీసీకి నూతన చీఫ్‌గా నియమితుడైన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Mahesh Kumar Goud: సీఎంను కలిసిన టీపీసీసీ కొత్త చీఫ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీకి నూతన చీఫ్‌గా నియమితుడైన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం కుటుంబ సమేతంగా తనను కలిసిన మహేశ్‌గౌడ్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో కలసి వినాయక పూజలో పాల్గొన్నారు. తర్వాత మహేశ్‌ గౌడ్‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. అనంతరం.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కూడా కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు.


ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్‌ను వారు అభినందించారు. ఇక ఆదివారం కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మహేశ్‌గౌడ్‌ను ఆయన నివాసంలోనూ, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన కార్యాలయంలోనూ కలిసి అభినందనలు తెలిపారు. మహేశ్‌గౌడ్‌ను కలిసిన వారిలో ఎంపీ చామల, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తేజస్వినీ రెడ్డి తదితరులున్నారు. అనంతరం మహేశ్‌ గౌడ్‌.. మంత్రి శ్రీధర్‌బాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయన వెంట ఉన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 03:35 AM