Share News

Hyderabad: సంగరేణి సీఎండీ బలరామ్‌కు ట్రీ మ్యాన్‌ అవార్డు..

ABN , Publish Date - Jul 01 , 2024 | 05:02 AM

సింగరేణి ప్రాంతంలో 18 వేలకు పైగా మొక్కలు నాటించి, 6 జిల్లాల్లో 35 చిట్టడవులను పెంచడంలో కీలకంగా వ్యవహరించినందుకుగాను సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ ట్రీ మాన్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డును అందుకున్నారు.

Hyderabad: సంగరేణి సీఎండీ బలరామ్‌కు ట్రీ మ్యాన్‌ అవార్డు..

హైదరాబాద్‌/కొత్తగూడెం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ప్రాంతంలో 18 వేలకు పైగా మొక్కలు నాటించి, 6 జిల్లాల్లో 35 చిట్టడవులను పెంచడంలో కీలకంగా వ్యవహరించినందుకుగాను సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ ట్రీ మాన్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డును అందుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రీన్‌ మ్యాపుల్‌ ఫౌండేషన్‌-2024 అవార్డుల ప్రదానోత్సవంలో ఆ సంస్థ ఎండీ అశుతోష్‌ వర్మ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు బలరామ్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా బలరామ్‌ మాట్లాడారు. ఈ ఏడాది వన మహోత్సవంలో మరో 2 వేల మొక్కలు నాటాలని వ్యక్తిగత లక్ష్యాన్ని పెట్టుకున్నానని తెలిపారు.

Updated Date - Jul 01 , 2024 | 05:02 AM