Share News

Vemula Veeresham: కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్న ఆ కేసులు

ABN , Publish Date - Apr 01 , 2024 | 09:32 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), మాజీమంత్రి కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) అన్నారు. సోమవారం నాడు నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశం నిర్వహించారు.

Vemula Veeresham: కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్న ఆ కేసులు

నల్గొండ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), మాజీమంత్రి కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) అన్నారు. సోమవారం నాడు నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘పొలం బాట’ పేరుతో వేటాడుతామంటూ కేసీఆర్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆయన కుటుంబాన్ని ఈడీ, ఫోన్ ట్యాపింగ్ కేసులు వెంటాడుతున్నాయని చెప్పారు.

Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతుల ఆత్మహత్యలను బీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. జగదీష్ రెడ్డి బీనామీ కాంట్రాక్టుల ధన దాహంతో ఈ ప్రాంతం ఎడారిగా మారిందని ధ్వజమెత్తారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు జాలాశయాలను అప్పజెప్పింది బీఆరెస్ పార్టీయేనని అన్నారు. ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసేందుకు దొంగ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని ఖాళీ చేయకపోతే ప్రజలకు నష్టం జరిగేదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

ఇవి కూడా చదవండి

Big Breaking: నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు.. పవన్ సంచలన కామెంట్స్

Rasamayi Balakishan: ముసలి నక్కలన్నీ కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నాయి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 09:59 PM