Share News

MLC Mallanna: అప్రమత్తంగా లేకుంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచేస్తారు..

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:24 PM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గత పది సంవత్సరాల పాలనలో ప్రజల్నే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmaar Mallanna) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కొమురవెల్లి మల్లన్న ఆలయ నిధులతోపాటు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు సైతం దోచుకొని పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Mallanna: అప్రమత్తంగా లేకుంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచేస్తారు..
MLC Teenmaar Mallanna

సిద్దిపేట: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గత పది సంవత్సరాల పాలనలో ప్రజల్నే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmaar Mallanna) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కొమురవెల్లి మల్లన్న ఆలయ నిధులతోపాటు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు సైతం దోచుకొని పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా లేకుంటే ముత్తిరెడ్డి లాగానే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం నియోజకవర్గాన్ని దోచుకుంటారని అన్నారు.


ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని చేర్యాలలోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలను జనగామ జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీగా చేర్యాల, కొమురవెల్లి ప్రాంతాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు.

Updated Date - Jul 21 , 2024 | 06:44 PM