Share News

YS Sharmila : వైఎస్సార్‌ 75వ జయంతి వేడుకలకు రండి!

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:20 AM

ఈ నెల 8న జరిగే వైఎస్సార్‌ 75వ జయంతి వేడుకలకు తప్పని సరిగా రావాలని సీఎం రేవంత్‌ రెడ్డిని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఆహ్వానించారు.

YS Sharmila : వైఎస్సార్‌ 75వ జయంతి వేడుకలకు రండి!

  • సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టికి షర్మిల ఆహ్వానం

హైదరాబాద్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఈ నెల 8న జరిగే వైఎస్సార్‌ 75వ జయంతి వేడుకలకు తప్పని సరిగా రావాలని సీఎం రేవంత్‌ రెడ్డిని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఆహ్వానించారు. మంగళవారం సీఎం నివాసానికి వెళ్లిన ఆమె.. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అలాగే ప్రజాభవన్‌కు వెళ్లి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనూ ఆహ్వానించారు. వైఎస్సార్‌ 75వ జయంతి వేడుకలను విజయవాడలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్లో ఘనంగా నిర్వహిస్తున్నామని, పార్టీలకు అతీతంగా అందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇతర నేతలు, ప్రముఖులు హాజరై వైఎ్‌సకు ఘనంగా నివాళులర్పించనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో ఆమె వెల్లడించారు.

Updated Date - Jul 03 , 2024 | 03:20 AM