Home » Dancer
చైనాకు చెందిన బాలిక లీ ముజీ(13) చరిత్ర సృష్టించింది. ఆదివారం రంగస్థల వేదిక మీద భరత నాట్య ప్రదర్శన చేసింది.
ఒకే చోట 10,000 మంది యువతులు నృత్యం చేస్తే ఎలా ఉంటుంది. ఆ దృశ్యం మాములుగా ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బారాముల్లా(Baramulla district)కు చెందిన 10 వేల మంది బాలికలు 'కషూర్ రివాజ్' సాంస్కృతిక ఉత్సవంలో అతిపెద్ద కశ్మీరీ జానపద నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు.
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఏడు నెలల నుంచి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ప్రముఖ కూచిపూడి నర్తకి అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు.
కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి సందడి చేశారు. కేసులతో బిజీగా ఉన్న ఆయన రిలాక్స్గా తెలుగు పాటలకు మాస్ స్టెప్లేసి ఆదరగొట్టారు. ఎస్పీ డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ముకేశ్ అంబానీ- నీతా అంబానీలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం చాలా సన్నాహాలు చేశారు. ఇంతలో వీరు ఒక పాటకు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్లు, వ్యూస్ను చూసి మనిషి హోదాను అంచనా వేసే పరిస్థితి నెలకొంది. వ్యూస్ వస్తే ఎగిరిగంతులేయడం, రాకపోతే నిరాశలో కూరుకుపోవడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో ఏదోటి చేసి మంది లైక్స్, వ్యూస్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ...
సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చిన తర్వాత చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ నెట్టింట్లో దూరిపోయారు. తమకు వచ్చిన ట్యాలెంట్ ను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ ఆనందం పొందుతున్నారు.
పల్నాడు జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఓ భారతీయ మహిళ అగ్రరాజ్యం అమెరికాలో పబ్లిక్ గా చేసిన భరతనాట్య ప్రదర్శన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.