Home » Lavu Sri Krishna Devarayalu
వైసీపీ(YSRCP) పాలనలో ఏపీ అప్పులపాలైందని తెలుగుదేశం(TDP) పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు విమర్శించారు. అప్పుల భారం రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. మంగళవారం ఆయన ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ చేసిన అప్పులను పునర్వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఎంతో అవసరమని టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని చెప్పారు. పార్లమెంట్లో బడ్జెట్పై చర్చలు జరిపారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తోంటే బాదేస్తోందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) తెలిపారు. ఎంపీలుగా గెలిచిన ఆ ఆనందం ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ సంతోషం లేకుండా పోయిందని చెప్పారు.
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.
ఏపీ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు (Sri Krishna Devarayalu Lavu) తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా లోక్ సభలో మాట్లాడారు.
పార్లమెంట్ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) విప్ జారీ చేసింది. పార్టీకి చెందిన 16 మంది లోక్సభ సభ్యులకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. రేపు లోక్సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి (GM Harish Balayogi) పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి సీఎం నారా చంద్రబాబు నాయుడు యంగ్ ఎమ్మెల్యేలను తీసుకున్న సంగతి తెలిసిందే. యువతకు టికెట్లు ఇవ్వడమే కాదు.. వారిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావడం.. మంత్రులుగా తీసుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా యంగర్స్కు బాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు...
పల్నాడు ఎస్పీ బింధుమాదవ్, తమ కుటుంబాలకు చుట్టరికం ఉందని చెబుతూ సాక్షిపత్రిక, మీడియా అసత్య కథనాలు రాస్తుందని నర్సారావు పేట కూటమి ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. తన వైపు నుంచి ఏ సమాచారం కావాలన్న ఇస్తామని అన్ని విధాలా అధికారులకు సహకరిస్తానని చెప్పారు.
Andhrapradesh: పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక పత్రికలో ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం ఉంది అని రాశారన్నారు. తమకు ఎస్పీ బిందు మాధవ్కు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఎస్పీతో ఫోన్ కూడా మాట్లాడలేదన్నారు.
పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం వెళ్లడంతో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది. అయితే ఇక్కడ ఎస్పీ బిందు మాధవ్తో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు సంబంధాలున్నాయంటూ ఓ పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దానిపై ఆయన స్పందించారు.